Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరంలేదు :
- బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం
హుబ్లీ : బీజేపీ దేశ వ్యాప్తంగా చాయ్ అమ్మి జేపీనీ సంపన్న పార్టీగా చేశారా అని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ప్రశ్నించారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో అవినీతిరహిత పాలన అందిస్తామని పేర్కొందని గుర్తుచేస్తూ... 'అవినీతి రహితమంటే ఏమిటి? బీజేపీని సంపన్న పార్టీగా చేయటానికి ఆయన ఏం చేశారు? అని కుమారస్వామి ఎద్దేవా చేశారు. అవినీతి రహిత సర్కార్ అని ఆయన చెప్పుకోవడం బూటకమన్నారు. కర్వార్లో ఓ బీజేపీ నేత నుంచి రూ. 78 లక్షలు పట్టుబడ్డాయనీ, అవి ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. దేశ భక్తి గురించి తాను మోడీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఓటు బ్యాంక్ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వేసిన సెటైర్లపై జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. తాను దేశభక్తుడిని కాదని ప్రధాని మోడీ చెబుతున్నారని, దేశభక్తి గురించి తాను మోడీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీర్లో ఒక్క పేలుడు ఘటన చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. అది తమ వారసత్వమని, తనపై ముద్ర వేసే హక్కు ప్రధాని మోదీకి లేదని కుమారస్వామి పేర్కొన్నారు.