Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పిలుపు
బెంగళూరు : విభజన చట్టం హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్ను మోసం చేసిన మోడీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లె సాగనంపాలని ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా కేంద్రంలో రాయచూరు లోక్ సభ సంకీర్ణ కూటమి అభ్యర్ధికి మద్దతుగా శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లా డారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలన్నారు. అంతేకానీ మోడీ లాంటి అబద్దాల కోరులు కాదన్నారు. ఈ ఎన్నికల్లో అటు వంటి వారిని ప్రజలు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. రాయచూరులో ఐఐటీ సంస్థ ఏర్పాటు, స్థానిక రైల్వేస్టేషనల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలంటే రాష్ట్రంలో సంకీర్ణ కూటమిని గెలిపించాల న్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోడీకి సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఎదురు గాలి వీస్తోందన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నా గుజరాత్కు ఏంలాభం చేకూర్చలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.