Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో శనివారం వడదెబ్బతో ఉపాధి కూలీ మృతిచెందాడు. కుంకుడుచెట్టు తండాకు చెందిన రమావత్ దేవోజీ(60) వారం రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పని చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.