Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మంచి ఫలితాలు సాధిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అని, పచ్చి అబద్ధాలతోనే కాలం గడుపుతు న్నారని విమర్శించారు. రాహుల్గాంధీ వయనాడ్లో పోటీ చేయడం రాజకీయ తప్పిదమని అన్నారు. 'ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయన్ పలు అంశాలపై తమ వైఖరిని వివరించారు.
ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకోవడంతో శబరిమల అంశం వేడెక్కిస్తోంది. ఈ పరిస్థితిపై ఎల్డీఎఫ్ అంచనా ఏమిటి?
ఎల్డీఎఫ్ పట్ల స్పష్టమైన మొగ్గు ఉందని ప్రి పోల్ సర్వేలు తమకు ఇష్టం లేకపోయినా చెప్పాల్సి వచ్చింది. శబరిమల అంశం తరువాత మరింతగా ఎలా బలోపేతం కావాలనే అంశంపైనే దృష్టిపెట్టాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ సమస్య ముందుకొచ్చింది. ప్రతిపక్షాలు శబరిమల యాత్రను ఒక సమస్యాత్మక ప్రాంతంగా మార్చివేశాయి. ఈ అంశంపై ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎటువంటి ఆందోళన లేదు. సంఫ్ు పరివార్ ఈ సమస్యపై రచ్చచేసేందుకు కొందరు కార్యకర్తలను రెచ్చగొట్టి యాత్రికులను ఇబ్బందిపెట్టింది.
ఆర్ఎస్ఎస్ మాదిరి హాని దేశానికి వామపక్ష కూటమి ఎప్పుడూ చేయలేదని రాహుల్ చెప్పారు. వామపక్షాల మీద కొత్తగా కనబ రుస్తున్న ఈ ప్రేమ వెనుక కాంగ్రెస్కి ఏమైనా ప్రత్యేక వ్యూహం ఉందా?
రాహుల్గాంధీ వామపక్షాలకు ఒక సందేశం ఇవ్వదలచుకున్నారు. ఆ పార్టీలను దేశంలో లేకుండా చేయదలచుకున్నామని చెప్పదలిచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉచ్ఛస్థితిలోనున్న మతోన్మాదానికి వామపక్ష కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో వామపక్షాలను దెబ్బతీయాలనే ఆలోచనతో పోటీచేస్తున్న రాహుల్గాంధీ చర్య ఏవిధంగా సమర్థనీయమవుతుంది?
రాహుల్గాంధీ రంగంలోకి దిగడం వల్ల వామపక్షాలకు నష్టం కలుగుతుందా?
రాహుల్గాంధీ దేశంలో ఎక్కడి నుంచి పోటీచేసినా కాంగ్రెస్ ప్రతినిధిగానే చూస్తారు. మైనారిటీలంతా కాంగ్రెస్వైపు సమీకరించబడే పరిస్థితి ఉత్పన్నం కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ వామపక్షాలు ఎక్కువ సీట్లు గెలుచుకున్నా అవి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో ఉండవని, కనుక వామపక్ష అభ్యర్థులకు ఓటువేయడం వృథా అని ఎకె ఆంటోనీ అంటున్నారు.
పార్లమెంటులో బలమైన శక్తిగా వామపక్షాలు ఉండటం ఈరోజు చాలా అవసరం. అనేక అనారోగ్యకర పద్ధతులను అరికట్టడానికి, దేశం యొక్క భవిష్యత్తు దిశను సరైన వైపు మళ్లించేలా చేయడానికి వామపక్షాల ఉనికి పార్లమెంటులో చాలా కీలకం.
యూడీఎఫ్ కొత్త ఉత్సాహంతో 20కి 20 సీట్లు గెలుస్తామంటూ చెప్తోంది. మీరేమనుకుంటున్నారు.
వాస్తవ పరిస్థితులను జీర్ణించుకోలేని ఒక మానసిక స్థితి నుంచి యూడీఎఫ్ చెబుతున్న మాటలవి. కాంగ్రెస్ రాష్ట్రంలో అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా ప్రజల నుంచి పూర్తిగా వేరుపడిపోయింది. మా పార్టీ అంతకంతకూ ఎక్కువమంది ప్రజల మద్దతును పొందగలుగుతోంది.లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మంచి ఫలితాలు సాధిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అని, పచ్చి అబద్ధాలతోనే కాలం గడుపుతు న్నారని విమర్శించారు. రాహుల్గాంధీ వయనాడ్లో పోటీ చేయడం రాజకీయ తప్పిదమని అన్నారు. 'ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయన్ పలు అంశాలపై తమ వైఖరిని వివరించారు.
ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకోవడంతో శబరిమల అంశం వేడెక్కిస్తోంది. ఈ పరిస్థితిపై ఎల్డీఎఫ్ అంచనా ఏమిటి?
ఎల్డీఎఫ్ పట్ల స్పష్టమైన మొగ్గు ఉందని ప్రి పోల్ సర్వేలు తమకు ఇష్టం లేకపోయినా చెప్పాల్సి వచ్చింది. శబరిమల అంశం తరువాత మరింతగా ఎలా బలోపేతం కావాలనే అంశంపైనే దృష్టిపెట్టాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ సమస్య ముందుకొచ్చింది. ప్రతిపక్షాలు శబరిమల యాత్రను ఒక సమస్యాత్మక ప్రాంతంగా మార్చివేశాయి. ఈ అంశంపై ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎటువంటి ఆందోళన లేదు. సంఫ్ు పరివార్ ఈ సమస్యపై రచ్చచేసేందుకు కొందరు కార్యకర్తలను రెచ్చగొట్టి యాత్రికులను ఇబ్బందిపెట్టింది.
ఆర్ఎస్ఎస్ మాదిరి హాని దేశానికి వామపక్ష కూటమి ఎప్పుడూ చేయలేదని రాహుల్ చెప్పారు. వామపక్షాల మీద కొత్తగా కనబ రుస్తున్న ఈ ప్రేమ వెనుక కాంగ్రెస్కి ఏమైనా ప్రత్యేక వ్యూహం ఉందా?
రాహుల్గాంధీ వామపక్షాలకు ఒక సందేశం ఇవ్వదలచుకున్నారు. ఆ పార్టీలను దేశంలో లేకుండా చేయదలచుకున్నామని చెప్పదలిచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉచ్ఛస్థితిలోనున్న మతోన్మాదానికి వామపక్ష కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో వామపక్షాలను దెబ్బతీయాలనే ఆలోచనతో పోటీచేస్తున్న రాహుల్గాంధీ చర్య ఏవిధంగా సమర్థనీయమవుతుంది?
రాహుల్గాంధీ రంగంలోకి దిగడం వల్ల వామపక్షాలకు నష్టం కలుగుతుందా?
రాహుల్గాంధీ దేశంలో ఎక్కడి నుంచి పోటీచేసినా కాంగ్రెస్ ప్రతినిధిగానే చూస్తారు. మైనారిటీలంతా కాంగ్రెస్వైపు సమీకరించబడే పరిస్థితి ఉత్పన్నం కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ వామపక్షాలు ఎక్కువ సీట్లు గెలుచుకున్నా అవి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో ఉండవని, కనుక వామపక్ష అభ్యర్థులకు ఓటువేయడం వృథా అని ఎకె ఆంటోనీ అంటున్నారు.
పార్లమెంటులో బలమైన శక్తిగా వామపక్షాలు ఉండటం ఈరోజు చాలా అవసరం. అనేక అనారోగ్యకర పద్ధతులను అరికట్టడానికి, దేశం యొక్క భవిష్యత్తు దిశను సరైన వైపు మళ్లించేలా చేయడానికి వామపక్షాల ఉనికి పార్లమెంటులో చాలా కీలకం.
యూడీఎఫ్ కొత్త ఉత్సాహంతో 20కి 20 సీట్లు గెలుస్తామంటూ చెప్తోంది. మీరేమనుకుంటున్నారు.
వాస్తవ పరిస్థితులను జీర్ణించుకోలేని ఒక మానసిక స్థితి నుంచి యూడీఎఫ్ చెబుతున్న మాటలవి. కాంగ్రెస్ రాష్ట్రంలో అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా ప్రజల నుంచి పూర్తిగా వేరుపడిపోయింది. మా పార్టీ అంతకంతకూ ఎక్కువమంది ప్రజల మద్దతును పొందగలుగుతోంది.