Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో బీజేపీ ఉనికి : సీపీఐ(ఎం) ఎంపీ బదరుద్దోజ ఖాన్
కోల్కతా : బెంగాల్లోని ముర్షిదాబాద్ నియోజకవర్గం ఎంపీ, సీపీఐ(ఎం) నేత బదరుద్దోజ ఖాన్ అదేస్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ నెల 23న ముర్షి దాబాద్లో ఎన్నికలు జరగనుం డటంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ బెదిరింపు రాజకీయా లతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న దని, అయినప్పటికీ ఈ స్థానంలో విజయం తనదేనని బదరు ద్దోజ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్వేష రాజకీయాలు పెరిగాయని ఓ పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో వివరించారు. సీపీఐ(ఎం) హయాంలో రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదని అన్నారు. 2011లో వామపక్ష పాలన ముగిసిన తర్వాతే మమతా బెనర్జీ సహాయంతో బీజేపీ రాష్ట్రంలోకి ప్రవేశించిందని తెలిపారు. బెంగాల్లో బీజేపీకి ఆమెనే చోటిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ లేదా బీజేపీ మాత్రమే ఉండాలని ఆమె కోరుకు న్నారని అన్నారు. మత విద్వేషాలు సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీతో సీపీఐ(ఎం) చాలా ఏండ్లుగా పోరాడు తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 34ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడూ కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.