Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2014లో 55కోట్లు.. 2019లో 76.91కోట్లు
రాంచీ : జార్ఖండ్లో పలువురు కోటీశ్వరులు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేసినవారిలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా హజరీబాగ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న జయంత్ సిన్హా ఎన్నికల అఫిడవిట్లో రూ. 76.91 కోట్ల ఆస్తులున్నట్టు వెల్లడించారు. 2014లో ఆయన రూ. 55 కోట్ల ఆస్తులను ప్రకటించడం గమనార్హం. జయంత్ సిన్హా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ సాహూ రూ. 33.62 కోట్ల ఆస్తులను ప్రకటించారు. 2014కు ముందు ఆయన తండ్రి యశ్వంత్ సిన్హా ప్రాతినిధ్యం వహించిన హజరీబాగ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ జయంత్ సిన్హా మళ్లీ పోటీ చేస్తున్నారు. రాంచీ నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ నేత సుబోధ్కాంత్ సహారు రూ. 4.70కోట్లు, బీజేపీ అభ్యర్థి సంజరు సేథ్ రూ. 1.40 కోట్లు, బీజేపీ రెబల్ ఎంపీ రామతాహల్ చౌదరి రూ. 4.59 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఖుతి స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా రూ. 8.72కోట్ల ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించారు.