Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రచారాల్లో వాడుకుని బీజేపీ ఇలా ట్రాన్స్ఫర్
న్యూఢిల్లీ: బాలకోట్లో భారత్ గర్వపడేలా చేశారంటూ.. వింగ్కమాండర్ అభినందన్ను పొగిడిన బీజేపీ..ఎన్నికల ప్రచారాల్లో వాడుకుని ఇపుడు బదిలీ వేటు వేసింది. ఇప్పుటి వరకూ విధులు నిర్వ హిస్తున్న శ్రీనగర్ ఎయిర్బేస్ నుంచి పాకిస్థాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్కు ఆయనను బదిలీ చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. భద్రతా కారణాల రీత్యా ఐఏఎఫ్ ఈ బదిలీ చేపట్టినట్టు మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎఫ్-16 విమానాన్ని కూప్పకూల్చివేసి, పొరపాటున శత్రుదేశ భూభాగంలో పట్టుపడిన రెండ్రోజుల తర్వాత తిరిగి భారత్లో అడుగుపెట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో చోటుకి బదిలీ చేసింది ఇదిలా ఉండగా..ఆ నాడు జరి గిన ఘటనలో గాయపడి న వర్దమాన్ కొద్ది వారా లుగా వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ విధుల్లోకి చేరనున్నట్టు కూడా ఐఏఎ ఫ్ అధికారులు చెబుతున్నారు. అయితే, విధుల్లో చేరడానికి ముందు బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) ఆయన పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్టు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇటీవల కొద్దివారాల పాటు వరుస వైద్య పరీక్షలు చేయించుకున్న అభినందన్కు రాబోయే వారాల్లో ఐఏఎం మరికొన్ని పరీక్షలు నిర్వహించ నున్నది. ఉద్యోగంలో చేరాలనుకుంటున్న సమయంలో..అభినందన్కు బదిలీ చేయటం ఐఏఎఫ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.