Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ప్రచార కార్యక్రమంలో ప్రధాని మోడీ మరోసారి ఆర్మీని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లోని కుషిన గర్లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లా డుతూ.. ఉగ్రవాదులను చంపేముందు జవాన్లు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్లోని షోపియాన్లో ఆదివారం ఉదయం ఇద్దరు మిలిటెంట్లను ఎన్కౌంటర్లో జవాన్లు అంతమొందిం చిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఉగ్రవాదులు బాంబులు, గన్నులతో జవాన్ల ముందు నిలబడ్డారు.
వారిని షూట్ చేసేందుకు జవాన్లు ఎన్నికల కమిషన్ దగ్గరకెళ్లి అనుమతి తీసుకోవాలా? నేను కాశ్మీర్కు వచ్చినప్పటి నుంచి ప్రతి రెండు లేదా మూడు రోజులకొకసారి క్లీన్ అప్ చేస్తున్నాం. ఇది నా క్లీన్ అప్ ఆపరేషన్' అని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్లు పలుసార్లు ఆర్మీని ప్రస్తావించి విమర్శ లనెదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రచారంలో ఆర్మీ, వారి చర్యలను ప్రస్తావించి ఓటర్లను ప్రభావితం చేయరాదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
'మేఘాలు రాడార్ను అడ్డుకుంటాయి'
కాగా, బాలాకోట్ గగనతల దాడిని వివరిస్తూ ప్రధాని మోడీ శనివారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయ న వ్యాఖ్యలపై విమర్శలతోపాటు వ్యంగ్రాస్త్రాలూ వెల్లువె త్తాయి. న్యూస్ నేషన్ అనే టీవీ చానెల్కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో బాలాకోట్ ఎయిర్స్ట్రైక్ను వివరిస్తూ.. 'ఆ రోజు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘా వృతమైంది. వర్షం మొదలైంది. ఆ మేఘాల్లో మనం వెళ్లగల మా అనే సందేహం మొదలైంది. నిపుణులందరూ ఎయిర ్స్ట్రైక్ను వాయిదా వేద్దామా? అనే ఆలోచనలు చేస్తున్నారు. అప్పుడు ఆ మేఘాలతో మనకు కలిసొస్తుందనే నేను చెప్పాను. మేఘాలతో మనం రాడార్ను తప్పించుకోగలం. ప్రొసీడ్ అన్నాను'అని ఆయన వ్యాఖ్యానించారు.