Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలిక మృతి
- గది బయట తాళం వేసి ఉండటంతో తప్పించుకోలేని వైనం
- ముంబయిలో దారుణం
ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం చోటుచేసుకున్నది. దాదర్ పోలీస్ స్టేషన్ పరి ధిలోని భవంతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఒక బాలిక మృతిచెందింది. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదానికి ముందు బాధిత బాలిక ఉన్న గదికి తల్లిదండ్రులు తాళం వేసి వెళ్లడంతో మంటల నుంచి తప్పించుకోలేక ఆమె తన నిండు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.45 గంటలకు సైతాన్ చౌకి పోలీస్ క్వార్టర్స్ మూడో అంతస్థులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ భారీ అగ్నిప్రమాదం ధాటికి భవంతిలోని ఎలక్ట్రికల్ వైరింగ్, పలు ఇండ్లలోని సా మాగ్రి దగ్దమైంది. మంటలను ఆర్పడానికి వెంటనే ప్రమా దస్థలికి నాలుగు అగ్నిమాపక యంత్రాలు చేరాయి. అనం తరం మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యుట్ కారణం అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
గది బయట తాళం.. శ్వాస ఆడక బాలిక మృతి
ఈ ప్రమాదంలో శ్రావణి చౌహాన్(15) అనే బాలిక మంటల్లో చిక్కుకొని తీవ్రగాయాలపాలై మరణించింది. ప్రమాదానికి ముందు ఆమె తల్లిదండ్రులు శ్రావణిని ఇంట్లో ఉంచి గది బయట తాళం వేసి ఓ పెండ్లి వేడుకకు వెళ్లారు. రాబోయే ప్రమాదాన్ని మాత్రం వారు ఊహించలే కపోయారు. అనంతరం మధ్యాహ్నం భవంతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో సదరు బాలిక గాఢనిద్రలో ఉన్నది. అంతలోనే మంటలు గదినిండా వ్యాపించాయి. దీంతో ప్రమాదం నుంచి తప్పిం చుకోవడానికి శ్రావణికి వీలులేకుండా పోయింది. మంటల్లో తీవ్రంగా గాయపడిన బాలిక.. గది నిండా పొగలు వ్యాపించడంతో శ్వాస ఆడటం కష్టంగా మారింది. ఆ బాలికను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. శ్రావణి అప్పటికే మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు.