Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. ఈనెల 22న రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(రిశాట్)-2బిను ప్రయోగించనున్నది. పీఎస్ఎల్వీ-సీ46 రాకెట్ ద్వారా రిశాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(ఎస్డీఎస్సీ) మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 5.27 గంటలకు ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఓ ప్రకటనలో ఇస్రో పేర్కొన్నది. భూమి నుంచి 555 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో రాకెట్ ప్రవేశపెట్టనున్నది. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 14వ ప్రయోగమని ఇస్రో తెలిపింది.