Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీయే కూటమి నేత నరేశ్ గుజ్రాల్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించడంపై సొంత పార్టీ నేతలతోపాటు, ఎన్డీయే మితప్రక్ష నాయకుల్లోనూ నమ్మకం సడలుతున్నది. 2014 ఎన్నికల్లోలాగా ప్రస్తుత ఎలక్షన్స్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించబోదని బాహాటంగానే తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతు న్నారు. ఎన్డీయే కూటమికి చెందిన శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేత, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడు నరేశ్ గుజ్రాల్ తాజాగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్ను దాటడం కష్టమేనని అన్నారు. ఇందుకు గల కారణాలని వివరిస్తూ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఓటర్ల వైఖరిలో మార్పు (ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక ల్లో అధికారంలోని బీజేపీని ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కిన విషయం తెలి సిందే!), ఉత్తరప్రదేశ్లో వైరి పార్టీలు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు ఈ ఎన్నికల్లో కలిసిరావడంలాంటివి బీజేపీకి ప్రతి కూలంగా మారనున్నాయని నరేశ్ గుజ్రాల్ వివరించారు. బీజేపీ శ్రేణు ల్లోనూ ఇదే అభిప్రాయమున్నదని తెలిపారు. కానీ, కూటమితో ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమైతే ఉందని తెలిపారు. ఇటీవలే బీజేపీ జనరల్ సెక్రెటరీ రాం మాధవ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిందేనని చెప్పారు. బీజేపీ మెజార్టీ మార్క్(272) దాటబోదని శివసేన నేత సంజరు రౌత్ ఇటీవలే వ్యాఖ్యానించారు.