Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్
- కోల్కతా ర్యాలీల్లో హాజరు
కోల్కతా : ఈసారి ఎన్నికల అనంతరం దేశంలో లౌకిక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో శనివారం నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరత్ మాట్లా డుతూ ''ఆ ప్రభుత్వంలో ప్రజా అనుకూల విధానాలు తీసు కొచ్చేందుకు రానున్న లోక్సభలో వామపక్షాల బలాన్ని పెంచ డం తప్పనిసరి'' అని ఆయన చెప్పారు. 2004 నాటి లోక్సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ అప్పట్లో ఏర్పడిన యూపీఏ..1 ప్రభుత్వ హయాంలో వామపక్షాలు, సీపీఐ(ఎం) ఒత్తిడి మేరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమా చార హక్కు చట్టాలను తీసుకురావడంతో పాటు దేశంలో తిరోగమన చర్యలను వ్యతిరేకిస్తూ
వాటిపై విజయం సాధించిందన్నారు.
హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే ఆరెస్సెస్ లక్ష్యం గా చేసుకున్నదని తెలిపారు. అయితే వారి దుష్ట ప్రయత్నాలకు మన లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగం వారికి అవరోధంగా మారిందని అన్నారు. ఏ రాజ్యాంగం పేరుతో ఎంపీ, ఎమ్మెల్యే లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో, దానిని లేకుండా చేసేం దుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోరక్షణ పేరుతో అమా యకులపై అల్లరి మూకలు దాడులు చేస్తున్నామని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో జరిగిన హత్యలకు సంబంధించి పోలీసుల దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి తోడు మృతుల కుటుంబ సభ్యులపేనే వివాదాస్పద కేసులు నమోదు చేశారని విమర్శించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీ వంటి మతతత్త్వ శక్తులతో పోరాడే సామర్థ్యం లేదన్నారు.
నిర్ణయాత్మక ఎన్నికలు
ప్రస్తుతం జరుగుతున్నది నిర్ణయాత్మక ఎన్నికలని ప్రకాశ్ కరత్ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మోడీ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతులకు దిగుబడి వ్యయంపై 50 శాతం కనీసంగా మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలతో పాటు మరెన్నింటినో తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులో దాదాపు 41 లక్షల 55 వేల కోట్ల రూపాయలను రుణాలను రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చారని విమర్శించారు. అదే రైతులకు సాయం చేయాలంటే మాత్రం వారికి చేతులు రావని అన్నారు.
బీజేపీకి మెజార్టీ అసాధ్యం
లౌకిక శక్తులను సమీకరించడంలో వామపక్షాలు విజయం సాధించాయని తెలిపారు. యూపీలో గతంలో 73 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఈసారి గట్టిదెబ్బ పడడం ఖాయమన్నారు. ఆ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలతో మహాగట్బంధన్గా బీజేపీకి షాక్ ఇవ్వబోతుందని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధించడం కేవలం భ్రాంతి మాత్రమేనన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో కార్మిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు ప్రజలకు సరైన మార్గం చూపాయన్నారు. మహారాష్ట్రలో జరిగిన చారిత్రాత్మక లాంగ్ మార్చ్ రైతులను సంఘటితం చేసిందన్నారు. ప్రయివేటీకరణ, నయా ఉదారవాద ఎజెండాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరి 8, 9 తేదీలలో నిర్వహించిన దేశ వ్యాప్త సమ్మెలో కోట్లాది మంది ప్రజలు, కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పారని ఈ సందర్భంగా ప్రకాశ్ కరత్ గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. గత ఎనిమిదేండ్లుగా తృణమూల్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిందన్నారు. కార్పొరేట్ మీడియా మద్దతులో బెంగాల్లో వామపక్షవాదాన్ని అంతం చేయాలనుకోవడం బీజేపీ, తృణమూల్లకు వృథా ప్రయాస అని అన్నారు. రాష్ట్ర ప్రజలు తృణమూల్, బీజేపీలపై పోరాడాలని నిర్ణయించుకునే సమయం ఇప్పుడు వచ్చిందని ప్రకాశ్ కరత్ తెలిపారు.