Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఘోరం జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో దాన్ని తీర్చలేకపోవడంతో అతని కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు ఆ కామాంధుడు. నిందితుడు హరి ప్రసాద్ (23) ఏడేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య కేసులో బెయిల్పై బయటకువచ్చాడు. మళ్ళీ మరో మైనరుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంభల్ జిల్లా బనియెతర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద రూ.22వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే చెప్పిన సమయానికి డబ్బులు సమకూరకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దాన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారి కొడుకు ఇంట్లో ఎవరూలేని సమయంలో అతని 17 ఏండ్ల కూతురుపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణంపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. హరి ప్రసాద్ నెల రోజుల క్రితమే జైలు నుంచి బయటకువచ్చాడు. ఏడేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, హత్యచేసిన ఘటనలో హరిప్రసాద్ ప్రధాన నిందితుడు. అతడికి సహకరించిన తండ్రిపైనా కేసు నమోదచేసి ఫిబ్రవరిలో ఇద్దరినీ పోలీసులు అరెస్టుచేశారు. రెండు నెలల పాటు జైల్లోనే ఉన్నారు. అయితే కోర్టులో విచారణ సందర్భంగా ఆ బాలిక తల్లిదండ్రులు తమ ఆరోపణలను వెనక్కి తీసుకోవడంతో న్యాయస్థానం తండ్రీకొడుకులకు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చిన నెల రోజుల్లో హరిప్రసాద్ మరో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.