Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్హెచ్-66 విస్తరణ పనులు నిలిపివేయాలని ఆదేశాలు
తిరువనంతపురం : సమాఖ్య వ్యవస్థను గౌరవిస్తామని.. అన్ని రాష్ట్రాలనూ ఒకే విధంగా చూస్తామని మోడీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. తమ అనుకూల ప్రభుత్వం ఉన్న చోట ఒకలా లేని చోట మరొకలా ప్రవర్తిస్తూ రాష్ట్రాలపై బీజేపీ సర్కారు వివక్ష చూపిస్తోంది. కేరళలో పలు అభివృద్ధి పనులకు కీలకంగా ఉన్న 66వ నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులను నిలిపివేయాలని కేంద్రం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్హెచ్-66 విస్తరణ కేరళకు చాలా కీలకం అయిన నేపథ్యంలో మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈనెల 9న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ.. రాజకీయ దురుద్దేశంతోనే మోడీ సర్కారు రహదారి విస్తరణ పనులను అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఎన్హెచ్-66ను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉత్తరాన ఉన్న కాసర్గఢ్ జిల్లాలోని తలపాడి నుంచి తిరువనంతపురం జిల్లా కజకొట్టామ్ వరకు నాలుగు వరుసల రహదారిగా మార్చాలని నిర్ణయించింది. ఈ రహదారి కేరళకు చాలా కీలకం. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పోర్టులను కలిపే విధంగా దీనిని రూపకల్పన చేశారు. దీంతోపాటు తిరువనంత పురంలో చేపట్టనున్న అత్యంత కీలకమైన విజింజమ్ పోర్టుకు కూడా ఈ రహదారిని అనుసంధానం చేస్తున్నారు. దీనిద్వారా సముద్ర రవాణా మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేగాక రాష్ట్రంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ రహదారి విస్తరణకు కేంద్రం తొలుత అంగీకారం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టి రహదారి నిర్మాణం కింద భూములు కోల్పోతున్న వారికి దేశంలోనే అత్యుత్తమ పరిహారం అందిస్తోంది. ఇంతలో గత నెల 15న ఈ ప్రాజెక్టుపై సమీక్షించిన కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ దీనిని రెండో ప్రాధాన్యత కింద చేర్చుతూ.. ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోకుండానే రహదారి నిర్మాణాన్ని ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021 వరకూ ఈ ప్రాజెక్టును చేపట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే భూసేకరణనూ నిలిపేయాలని తెలిపింది.
మోడీ సర్కారు తాజా నిర్ణయంపై విజయన్ మండిపడ్డారు. రాష్ట్రంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించడం వెనక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు. సంఫ్ు పరివార్తో కలిసి బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని విమర్శిం చారు. గతేడాది వరదలు ముంచెత్తినప్పుడు, వోకీ తుఫాను సమయంలోనూ కేరళపై కేంద్రం వివక్ష చూపించిన మాదిరిగానే ఇప్పుడు అభివృద్ధి పనులనూ అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కీలకంగా ఉన్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంలో మోడీ సర్కారు కుట్ర దాగి ఉన్నదని విజయన్ ఆరోపించారు.