Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడికక్కడే మృతి, సోదరుడికి తీవ్రగాయాలు
నవతెలంగాణ - కరీంనగర్ రూరల్
ఆడుకుంటున్న అన్నాచెల్లెలుపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో చిన్నారి మృతిచెందింది. ఆ పాప సోదరుడికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ విషా దకర ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందులలో సోమవారం జరిగింది. కొత్తపల్లి ఎస్ఐ స్వరూప్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఒల్పి ఎల్లప్ప జీవనోపాధి కోసం భార్యాపిల్లలతో ఎలగందల్ వచ్చారు.
సోమవారం తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా, చిన్నారులు లక్ష్మిబాయి, రాములు ఇంటి ఎదుట ఉన్న ట్రాక్టర్ వెనకాల ఆడుకుంటున్నారు. ఇది గమనించని ట్రాక్టర్ డ్రైవర్ ఉదయం ఏడు గంటలకు వాహనాన్ని వెనక్కి తీశాడు. దీంతో లక్ష్మిబాయి(7) తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రాములు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన కుమార్తె మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సంతోష్, యాజమానిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ఒల్పి ఎల్లప్ప ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ స్వరూప్రాజ్ తెలిపారు.