Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కథ కంచికే!
- ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి 40-55 స్థానాలు
15-25 స్థానాలకు బీజేపీ పరిమితం
- ఓటింగ్ సరళి, క్షేత్రస్థాయి సమాచారంతో 'ఆంత్రో డాట్ ఏఐ' అధ్యయనం
- అధికార పార్టీకి దూరమైన మహిళలు, కీలక సామాజికవర్గాలు
ఉత్తరప్రదేశ్లోనూ దాదాపు అన్ని స్థానాలకూ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈనేపథ్యంలో యూపీలో బీజేపీకి వచ్చే స్థానాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ ఆరు దశల్లో పోలింగ్ సరళి, ఓటర్ల నాడిని తెలుసుకోవటంపై 'ఆంత్రో డాట్ ఏఐ' అనే సంస్థ అధ్యయనం చేసింది. ఇందులోని సెఫాలజిస్టులు, ఆంత్రోపాలజిస్టులు, గణాంకవేత్తలు వేస్తున్న అంచనా...రాష్ట్రంలో బీజేపీ పునాదులు కదిలిపోనున్నాయి. ఒక సునామీ మాదిరిగా, భూమి కంపించేలా...ఎన్నికల ఫలితాలు ఉంటాయని సంస్థ అంచనా వేస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లు 'మహా గట్బంధన్' వైపు మరిలాయి, బీజేపీకి 15-25స్థానాలు వస్తే గొప్ప...అని 'ఆంత్రోడాట్ ఏఐ' తాజా కథనం పేర్కొన్నది.
న్యూఢిల్లీ : గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 71 స్థానాలు వచ్చాయి. మళ్లీ అధికారం కైవసం చేసుకోవాలంటే కనీసం 50స్థానాల్ని నిలబెట్టుకోవటం తప్పనిసరి. ఇక్కడ ఒకవేళ బీజేపీ ఘోరంగా ఓడిపోతే, మరో రాష్ట్రంలో నష్టాన్ని పూడ్చుకునే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో 'ఆంత్రో డాట్ ఏఐ' చేసిన అధ్య యనంలో తేలిందేంటంటే, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారు. అది ఓట్లరూపంలో, అటు తర్వాత సీట్లరూపంలో వ్యక్తం కాబోతోంది. యూపీలోని ప్రతీ అసెంబ్లీ స్థానంలో జరిగిన అధ్యయనం ప్రకారం, బీజేపీ సాంప్ర దాయ ఓటు బ్యాంక్ లో చీలిక వచ్చింది. మహిళలు పెద్ద సంఖ్యలో దూరమయ్యారు. కారణం నోట్లరద్దు, జీఎస్టీ. మరో ముఖ్య కారణం, ఇక్కడి ఎంపీలంతా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించటం లేదు. స్థానికంగా ప్రజల సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలా కూడా లేదు. అధికారమంతా ప్రధాని మోడీ, పీఎంఓ వద్ద ఉండటం యూపీలో బీజేపీని దెబ్బకొడు తోంది. పోనీ న్యూఢిల్లీపై వీరి ప్రభావముందా? అంటే అదీ లేదు. 71మంది ఎంపీలను ఇచ్చాం, మా రాష్ట్రానికి దక్కుతున్న ప్రాధాన్యత ఏంటి? అన్న ఆలోచన యూపీ ఓటర్లలో కలిగింది.
కుర్మీలు, కుశ్వాహులు, నిషాదులు ఈసారి 'మహాఘట్ బంధన్'వైపు మొగ్గుచూపినట్టు తెలు స్తోంది. ఇంతపెద్ద స్థాయిలో ఓట్లు మరో పార్టీకి తర లింది నిజమే అయితే, ఆ నష్టాన్ని బీజేపీ పూడ్చు కోవటం సాధ్యమయ్యే పనికాదు. 'మంచి రోజులు' వస్తాయనీ, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనీ 2014లో మోడీ చేసిన వాగ్దానాల్ని నమ్మినవారిలో మహళలు ఎక్కువగా ఉన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ విధానాలు వారిని తీవ్రంగా నష్టపరిచాయి. దీంతో ఈసారి మహిళలంతా ఓట్లరూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనే సమాచారం అందింది.
'ఆంత్రో డాట్ ఏఐ'కి చెందిన సమాచార నిపుణులు, డాటా సైంటిస్టులు, ఆంత్రోపాలజిస్టులు, గణాంక విశ్లేషకులు యూపీ ఎన్నికల సరళిపై ప్రత్యేక అధ్యయనం చేశారు. ఎందుకంటే, కాంగ్రెస్ అయినా(ఇక్కడ మహాఘట్ బంధన్), బీజేపీ అయినా... న్యూఢిల్లీ చేరాలంటే యూపీ రహదారిలో సాఫీగా ప్రయాణించాల్సిందే. ఈనెల 19న పోలింగ్ ముగియగానే, 'ఆంత్రో డాట్ ఏఐ' 80స్థానాల పోల్ సర్వే ఫలితాల్ని ప్రకటిస్తుంది.
అయోధ్యలో ఎదురైన ఒక ప్రశ్నకు బహుశా బీజేపీ వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఐదేండ్లు కేంద్రంలో స్పష్టమైన అధికారాన్ని అనుభవించారు. రాష్ట్రంలోనూ భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచి రెండేండ్లుగా పాలన సాగిస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో పురోగతి ఏది?అన్నది స్థానిక ఓటరు వేస్తున్న ప్రశ్న.