Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై : భారత్కు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత తొలి ఉగ్రవాది గాడ్సే అంటూ ప్రముఖ నటుడు, ముక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) అధినేత కమల హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'హిందూ ఉగ్రవాదం'పై దేశంలో జోరుగా చర్చ నడుస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమ నార్హం. దేశంలో ప్రజలందరూ సమానత్వంతో జీవిం చాలని ఆకాంక్షించే వారిలో తానూ ఒకడినని ఆయన తెలిపారు. తమిళనాడులోని అరవకురిచిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న కమల్ మాట్లా డుతూ.. 'స్వతంత్య్రం వచ్చిన తర్వాత భారత్లో తొలి ఉగ్రవాది హిందువు. ఆయన పేరు నాథూరాం గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది. ముస్లింలు ఎక్కువున్న ప్రాంతం కాబట్టి నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిల్చోని నేను ఈ మాటలు
మాట్లాడుతున్నాను' అని వ్యాఖ్యానించారు. గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తాను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. త్రివర్ణ పతాకంలో ఉన్న మూడు రంగుల వివిధ వర్గాల విశ్వాసాలను సూచించినట్టుగానే.. తానూ సైతం అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు టి. సౌందరరాజన్ ఖండించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కమల్ ఈ విధంగా మాట్లాడటం తగదని అన్నారు. కమల్ గతంలోనూ ఓసారి 'హిందూ ఉగ్రవాదం' అంటూ మాట్లాడి వివాదాలకు కేంద్ర బిందువైన విషయం విదితమే. దీనిపై అప్పట్లో బీజేపీ, పలు హిందూత్వ సంఘాలు మండిపడ్డాయి.