Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హింసాత్మక కార్యకలాపాలు సాగిస్తూ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తుందన్న కారణంతో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)పై కేంద్ర హోం శాఖ మరో ఐదేండ్లపాటు నిషేధం విధించింది. చట్ట విరుద్ధ కార్యక లాపాలు సాగిస్తోందని ఇంతకు ముందు 2014లో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై నిషేదం విధించింది. ఎల్టీటీఈ సంస్థ ఇప్పటికీ భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, భారతీయుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని హోంశాఖ తెలిపింది. ఈ సంస్థకు చెందినవారు ఇంటర్నెట్ పోర్టల్స్లో ఆర్టికల్స్ రాస్తూ శ్రీలంకలో ఉంటున్న తమిళుల్లో దేశ వ్యతిరేక భావన తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎల్టీటీఈ పరాజయానికి భారత ప్రభుత్వమే కారణమంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇటువంటి చర్యలు దేశానికి చెందిన ముఖ్యుల భద్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.