Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్షా కొల్కతా రోడ్షోలో కాషాయ కార్యకర్తల వీరంగం
కొల్కతా : బీజేపీ కార్యకర్తలు బరితెగించారు. ప్రముఖ సంఘసంస్కర్త పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని విధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్ న్యూ కొల్కతాలో అమిత్షా మంగళవారం నిర్వహించిన రోడ్షోలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఉత్తర కొల్కతా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీి రోడ్షో నిర్వహిస్తుండగా, 'అమిత్ షా గోబ్యాక్' అంటూ టీఎంసీి కార్యకర్తలు నినాదాలు చేశారు. కలకత్తా యూనివర్శిటీ గేటు వద్దకు వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డారు.
అనంతరం విద్యాసాగర్ కళాశాల ప్రాంగణానికి వచ్చేసరికి కళాశాల ఆవరణలో ఉన్న విద్యాసాగర్ విగ్రహాన్ని రాడ్లతో ధ్వంసం చేశారు. ఇది 1970ల నాటి అరాచకం ఇప్పుడు కనిపిస్తోంది. పలువురు విద్యార్థుల బైక్లను ఆర్ఎస్ఎస్ గూండాలు తగులబెట్టారు. టీఎంసీ, బీజేపీ గూండాలు తరచూ వీధుల్లో ఇలాగే వీరంగం చేస్తున్నారు. కొల్కతాలోని విద్యాసాగర్ కళాశాల రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ అసిత్ ఘోష్ చమర్చిన కళ్లతో కళాశాల కరస్పాండెంట్తో మాట్లాడారు. చరిత్రలో మాయనిమచ్చగా ఈ ఘటన నిలిచిపోతుందని అన్నారు. విద్యాసాగర్ 200వ జయంతోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్, టీిఎంసీి గూండాయిజం చేస్తున్నాయని, ఇది రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షించడమేనని చెప్పారు.