Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల సంభవించిన ఫొని తుఫాను కారణంగా భారీ విధ్వంసాన్ని చవిచూసిన ఒడిషాను ఆదుకోవాలని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) పిలుపునిచ్చింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. తీవ్రంగా దెబ్బతిన్న ఒడిషాలో ఇటీవల ఎఐకెఎస్, సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ బృందంలో సిపిఎం కేంద్రం కమిటీ సభ్యులు, ఎఐకెఎస్ జాయింట్ సెక్రటరీ విజూ కృష్ణన్, సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, ప్రముఖ నేత జనార్ధన్ పాటీ, ఒడిషా కృషక్ సభ కార్యదర్శి సురేష్ పాణిగ్రాహి, అధ్యక్షుడు యంబేశ్వర్ సమంత్రేలు ఉన్నారు. వీరితో పాటు డివైఎఫ్ఐ నేత జతిన్ మహంతి, బాపి మహారాణ కూడా ఉన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న భువనేశ్వర్, పూరి,ఖుర్దా ప్రాంతాలతోపాటు తదితర ఏరియాల్లో పర్యటించారు.