Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : తనకు బినామీ ఆస్తులు, విదేశీ బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలంటూ ప్రతిపక్షాలకు ప్రధాని సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్లోని బాలియాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ తనకు బినామీ ఆస్తులు, విదేశీ బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నా, ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినా, విలాసవంతమైన కార్లు కొన్నా వాటన్నిటినీ ప్రతిపక్షాలు నిరూపించాలని సవాల్ చేశారు.