Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్కు విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీస్ రేటును రద్దు చేయటం ద్వారా తమకు కనీస వేతనాలను ఇప్పించాలని రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్.. కార్మికశాఖ కమిషనర్ను కోరింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.శేఖర్, వ్యవస్థాపక అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు కమిషనర్ను మంగళవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది కార్మికులు గత 18 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థ ల్లో పనిచేస్తున్నారని వారు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తమకు పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. ఈ అంశా లపై పలుమార్లు యాజమాన్యాలకు వినతిపత్రాలు సమర్పించామని వివరిం చారు. దీంతో ఈనెల ఐదు నుంచి మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. అయినప్పటికీ తమతో ఎలాంటి సంప్రదిం పులూ జరపని యాజమాన్యం.. రీడర ్లపై అధికారులతో ఒత్తిడి తెస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేప థ్యంలో విద్యుత్ సంస్థలతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కమిషనర్ ను కోరారు. మరోవైపు తమ డిమాండ్లపై స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 16న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.