Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
- జూన్ 7న ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఉపఎన్నిక నిర్వాహించాల్సి వస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంత్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో గత ఏడాది డిసెంబర్లో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవి 2023 వరకు ఉంది. దీంతో ఈ కోటా కింద ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 21న కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూన్ 7న పోలింగ్ నిర్వహిం చనున్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ఈ నెల 28 చివరి తేదీ, 29న నామినేషన్లు పరిశీలన, ఈ నెల 31 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. జూన్ 7న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.