Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. 2002 గుజరాత్ మత ఘర్షణల అనంత రం బీజేపీకి మద్దతుగా నిలబడి కేంద్ర కేబినెట్లో మమత బెనర్జీ పదవి దక్కించుకున్నారని మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. 2004 ఎన్నికల్లో మమత బీజేపీతో పొత్తు కూడా పెట్టుకున్నారని, బెంగాల్లో బీజేపీ ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది తృణమూల్ కాంగ్రెస్సేనని విమర్శించారు. కాషాయ పార్టీతో అదే స్నేహాన్ని టీఎంసీ ఇప్పటికీ కొనసాగిస్తోందని ఏచూరి విమర్శించారు. బీజేపీతో అంతగా అల్లుకుపోయిన మమత బెనర్జీ తమపై నిందలు వేస్తుండటం హాస్యాస్పదమని తెలిపారు. బీజేపీ, తృణమూల్ సహజ మిత్రులమని పేర్కొంటూ మమత బెనర్జీ గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను ఈ సందర్భంగా ఏచూరి పోస్టు చేశారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్-బీజేపీతో నిరంతరాయంగా పోరు సల్పుతున్నది వామపక్షాలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.