Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ రైతులపై జల ఫిరంగుల ప్రయోగం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డ రైతులు
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
మొహలీ/ఛంఢఘీర్: తమకు జరుగుతున్న అన్యా యంపై పంజాబ్ రైతన్నలు కదంతొక్కారు. రైతుల అవస్థలను పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి చేపడుతున్న రైతు వ్యతిరేక నిరం కుశ విధానాలపై యుద్ధం ప్రకటించారు. అయితే రైతుల గోడు పట్టించుకొని వారి సమస్యలను పరిష్క రించాల్సిన ప్రభుత్వం, ఆవిధంగా స్పందించక పోగా, ప్రతిగా రైతులపైనే పోలీసు బలగాలను వినియోగిం చి తనకర్కశత్వాన్ని ప్రదర్శించింది. తమ దురవస్థను పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా పంజాబ్ రైతులు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాజ్భవన్ వరకూ మార్చ్ తలపెట్టారు. ఈనిరసన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తం గా రైతులు కదిలివచ్చారు. అయితే వీరిని పోలీసులు మొహలీ-చండీగఢ్ సరిహద్దులోనే అడ్డు కున్నారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు అక్కడే అందోళనకు దిగారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కారంలో ఆయా ప్రభుత్వాలు విఫల మయ్యాయని దుయ్యబట్టారు. అయితే పరిస్థితి అదు పులోకి రాకపోవడంతో పోలీసులు జల ఫిరంగులతో రైతులను చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు.