Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబర్పేటలో ఎమ్ఐఎమ్ చెబుతున్న స్థలంలో అసలు ప్రార్థనామందిరం లేదని ఇంటి యజమాని చెబుతున్నా నమ్మరా అని ప్రభుత్వాన్ని బీజేపీ నేత కిషన్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ హయాంలోనే ఆ స్థలం 50 శాతం రోడ్ వైనడింగ్ లో పోయిందన్నారు. చే నంబర్ చౌరస్తా, శ్రీరామ్ థియేటర్ చౌరస్తా వరకు ఉన్న ముస్లిం బొందల గడ్డ పోకూడదని ఫ్లై ఓవర్ తెచ్చామని అన్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలంలో ఎంఐఎం ఎమ్మెల్యే ఖాద్రి అక్కడ ప్రార్థనా మందిరం కట్టారని విమర్శించారు. ఖాద్రిపైనా, అతనికి సహకరించిన అధికారులు, పోలీ సులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అజారుద్దీన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా?
పార్టీవా? : దత్తాత్రేయ
అంబర్పేట్లో జాతీయ రహదారి ప్లైఓవర్ కోస సేకరించిన స్థలంలో ప్రార్థనా మందిరం ఉన్నదని, అధికారులు అక్రమంగా కూల్చివేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? పార్టీ విధానామా? అనికేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ప్రశ్నించారు. దానిపై టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టతనివ్వాలని అన్నారు.
పాక్కు వత్తాసు పలికేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు : పొంగులేటి
యావత్ దేశం పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటే...కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం పాకిస్తాన్ కు వత్తాసు పలికే విధంగా అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, ఆయన్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.