Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ వెళ్లగానే... మీడియా ముందుకు డీఎంకే అధినేత స్టాలిన్
- చంద్రబాబు వద్దకు డీఎంకే నేత
- అమరావతిలో 25 నిమిషాలసేపు ఏపీ సీఎంతో భేటీ
చెన్నై: లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఫెడ రల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ చెన్నై వెళ్లి డీఎంకే అధినేతను కలిసిన విషయం విదితమే. ప్రాం తీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిం చాలనీ, ఇందు కోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు. అయితే తెలంగాణ ముఖ్య మంత్రితో భేటీ జరిగిన మరుసటి రోజైన మంగళవారం.. ఫెడరల్ ఫ్రంట్పై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.బీజేపీ, కాంగ్రెస్ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నదని తనకు అన్పించడం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే మే23 తర్వాతే దీనిపై ఓస్పష్టత వస్తుందన్నారు. కేసీఆర్ చెన్నైకు వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ కోసం కాదనీ, కేవలం దైవ దర్శనాలకు వచ్చారని చెప్పారు. ఆలయాల దర్శన కోసం తమిళ నాడు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకే నా అపాయింట్మెంట్ కోరారు. అంతే' అని స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వివరించారు.
చంద్రబాబుతో దొరై మురగన్ మంతనాలు
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురుగన్ సమావేశమయ్యారు. సుమారు 25 నిముషాలపాటు వారిద్దరూ చర్చలు జరిపారు. స్టాలిన్, కేసీఆర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు దొరై మురుగన్ వివరించినట్టు తెలిసింది. గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి జాతీయ స్థాయిలో టీడీపీ, డీఎంకే పోరాడుతున్నాయి. పలు అంశాల్లో డీఎంకేకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. కేసీఆర్తో అలా వెళ్లాక.. తెల్లారే దొరై మురుగన్ను అమరావతికి స్టాలిన్ పంపారు. భవిష్యత్ కార్యాచరణపై తీసుకోవాల్సిన అంశాలపై కూడా చంద్రబాబుతో మాట్లాడాలని డీఎంకే నేతలు నిర్ణయించారు.