Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంకేతాలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీని గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఐక్యతతో ముందుకెళ్తున్నాయి. మోడీని మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని రేసులో ఉన్న బెంగాల్ సీఎం మమత బెనర్జీ తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. మోడీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా విపక్ష కూటమిలోని మిగతా పార్టీల వారితో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రతిపాదించినట్టు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తణమూల్ సంకేతాలు పంపినట్టు తెలిసింది.