Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూముల కబ్జా గురించి తెలుసుకోవాలనుకున్నందుకే
లక్నో : యోగి ఆదిత్యానాథ్ 'గూండా రాజ్' పాలన సాగుతున్న ఉత్తరప్రదేశ్లో తాజాగా సమాచార హక్కు కార్యకర్తపై కాల్పులు జరిగాయి. ముజఫర్నగర్లోని దింద్వాలీ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల కబ్జా గురించిన సమాచారం కోసం కంప్లైంట్ దాఖలు చేసినందుకే ఆయనపై ఈ హత్యాప్రయత్నం జరిగినట్టు తెలుస్తున్నది.
దింద్వాలీ గ్రామంలోని పంట పొలాల్లోకి వెళ్లిన ఆర్టీఐ కార్యకర్త కృష్ణపాల్(35)పై నలుగురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్నదని ఎస్పీ సత్పాల్ తెలిపారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినందుకే ఆయనపై కాల్పులు జరిగి ఉండొచ్చని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు.