Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్కు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దేశంలో తొలి హిందూ ఉగ్రవాది గాడ్సే అంటూ కమల్ హాసన్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కమల్హాసన్పై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇది ఈ హైకోర్టు పరిధిలోనిది కాదనీ, ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోరమ్లోనే దీనిపై సంప్రదించాలని జిఎస్ సిస్టానీ, జ్యోతిసింగ్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్కు సూచించింది. అలాగే పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ దాఖలుచేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఎన్నికల్లో లబ్ది కోసం మతాన్ని వాడుకుంటున్నారనీ, హిందూమతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అశ్విని ఉపాధ్యాయ ఆరోపించారు. రాజకీయ లబ్దికోసం మతాన్ని దుర్వినియోగం చేస్తున్న అభ్యర్థులను డిబార్ చేయాలనీ, పార్టీల రిజిస్ట్రేషన్ను కూడా రద్దుచేయాలని పిటిషనర్ కోరారు.