Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 1 నుంచి నోయిడాలో అమలులోకి
నోయడా : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు నోయిడా, ట్రేటర్ నోయిడా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. జూన్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానున్నది. రహదారి భద్రతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. పెట్రోల్ బంక్ల యజమానులతో జిల్లా మేజిస్ట్రేట్ బ్రజేశ్ నారాయణ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలుచేయాలని, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో దీనిని అమలులోకి తెస్తామని బ్రజేశ్ నారాయణ్ చెప్పారు.