Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం
జైపూర్ : పాఠశాల పుస్తకాల్లో ఆరెస్సెస్ సిద్దాంతకర్త సావర్కర్ బయోగ్రఫీలో మార్పులు చేర్పులకు నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం మళ్లీ అలాంటి చర్యకు పూనుకున్నది. మోడీ సర్కారు దేశంలో తీసుకొచ్చిన విఫల ప్రయోగం 'పెద్దనోట్ల రద్దు' అంశాన్ని పన్నెండో తరగతి పాఠ్యపుస్తకం నుంచి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చే పుస్తకాలలో నోట్లరద్దు ప్రస్తావన ఉండదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్సింగ్ దోతసర తెలిపారు. గత బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణే ఎజెండాయే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పుస్తకాల్లో తీసుకొచ్చిన మార్పులపై అధ్యయనం చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఓ కమిటీని అశోక్ గెహ్లాట్ సర్కారు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 'నోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం. ఉగ్రవాదం, నల్లధనం, అవినీతి అనే మూడు అంశాలను అంతం చేస్తామని మోడీ సర్కారు తెలిపింది. కానీ,అందులో ఏ ఒక్కటీ సఫలం కాలేదు. ఈ ప్రయోగం దేశంపై 10వేల కోట్ల రూపాయల భారాన్ని వేసింది. ప్రజలంతా క్యూలైన్లలో నిలబడి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు' అని దోతసర తెలిపారు. 2017లో రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో నోట్ల రద్దు అంశాన్ని చేర్చింది.