Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ సారి బీజేపీకి 200కన్నా తక్కువే..!!
- రాజకీయ వర్గాల్లో చర్చ
న్యూఢిల్లీ: ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 7 రోజుల్లో వెల్లడి కానున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు ఎన్డీఏకు రానిపక్షంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఏమేరకుంటుందన్నదీ చర్చనీయాంశంగా మారింది. మే 23 అటు అధికార పక్షాన్నీ, ఇటు ప్రతిపక్షాలనేగాక, ఆయా పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలనూ తమ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్థుల్లా మార్చింది. 40రోజులపాటు(ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు) ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు అందరినీ ఊపిరి బిగబట్టి ఎదురు చూసేలా చేశాయి..
ఈసారి మోడీ తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఏమేరకు..? ఎన్డీఏ చతికిల పడ్తే, ప్రతిపక్షాలు తమ ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటాయి..? ఈ ప్రశ్నలు దేశ పౌరుల మధ్య చర్చకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల సరళి ఏవిధంగా ఉండనున్నదానిపై ఓ విశ్లేషణ..
2014 ఎన్నికలనాటి పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదని సర్వత్రా చర్చ జరుగు తున్నది. 2014కు ముందు పదేండ్లపాటు కాంగ్రెస్ పాలనలో జరిగిన పలు ఆర్థిక కుంభకోణాలు, ఉగ్రదాడులు..ఆ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కలిగిం చాయి. ఆ నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచిన మోడీ తాను అధికారంలోకి వస్తే నీతిమంతమైన పాలన అందిస్తానంటూ దేశ ప్రజల్ని నమ్మబలికారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానంటూ యువతను ఆకట్టు కునే ప్రయత్నం చేశారు. వీటికితోడు బ్రాండ్ ఇమేజ్తో అతిపెద్ద ఓట్ల చీలికను ఓ ప్రణాళికగా సంఫ్ుపరివార్ అమలు చేసింది. ఇప్పుడు ఐదేండ్ల పాలన ప్రత్యక్షంగా చూసిన తర్వాత మోడీ పట్ల ఆకర్షణ అడుగంటింది. ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు(నోట్ల రద్దు, హడావుడిగా జీఎస్టీని అమలులోకి తేవడం) దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరు కున్నది. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన నీరవ్మోడీ, విజరు మాల్యాలాంటివాళ్లు దేశం విడిచి పారిపోతుంటే కండ్లప్పగించి చూశారన్న అప వాదు ఉండనే ఉన్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు మోడీకి సానుకూలంగా ఉండే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
చెప్పుకోవడానికి తన పాలనలో సాధించిన పాజిటివ్ అంశాలేమీ లేకపోవడంతో ప్రతిపక్షాల అనైక్యత, లోపాలపై ప్రధాని, ఆయన అనుయాయులు దృష్టి సారించారు. తమ నాయకుడి పనితీరు పట్ల అసంతృప్తి ఉన్నా బయటకు వ్యక్తం చేయలేక లోలోనే కుమిలిపోతున్న దుస్థితి కొందరిది. ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘిస్తూ భద్రతా దళాలు ఉగ్రవాదులపై చేపట్టిన చర్యల్ని తమ ఘనతగా చాటుకుంటూ బీజేపీ నేతలు ప్రచారం సాగించారు. మోడీ,అమిత్షా ద్వయం ఈ ఉల్లంఘనలకు పదేపదే పాల్పడ్డా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న విమర్శలున్నాయి. ఎన్ని గిమ్మిక్కులు చేసినా మోడీ నేతృత్వంలోని బీజేపీకి 2014నాటి సానుకూల పరిస్థితి మాత్రం 2019లో లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లాయి. బీజేపీ, దాని మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నుంచి పంజాబ్లోనూ అధికారం కాంగ్రెస్ చేతుల్లోకి మారింది. కర్నాటకలోనూ అదే పరిస్థితి. అక్కడ కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అధికారం చేపట్టాయి. ఉత్తర్ప్రదేశ్లో గత లోక్సభ ఎన్నికలనాటి పరిస్థితి ఇప్పుడు లేదు. గత ఎన్నికల్లో యూపీలో మొత్తం 80 సీట్లుం డగా బీజేపీ, దాని మిత్రపక్షం అప్నాదళ్కు ఆ ఎన్నికల్లో 73 సీట్లొచ్చాయి. ఈసారి బీఎస్పీ, ఎస్పీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈసారి అక్కడ బీజేపీకి గతంలోకన్నా కనీసం 30 నుంచి 40 సీట్లు తగ్గుతాయన్న అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఢిల్లీ లోని 7 సీట్లనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోగా, ఈసారి ఆమ్ఆద్మీ పార్టీ నుంచి అక్కడ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అంతేకాదు, ప్రధాని మోడీకి తన సొంత రాష్ట్రం గుజరాత్లోనూ మునుపటిలా సానుకూల పరిస్థితి లేకపోవడం గమ నార్హం. దేశవ్యాప్తంగా వచ్చిన రాజకీయ మార్పు వల్ల మొత్తమ్మీద ఈసారి బీజేపీకి కనీసం 90 నుంచి 100 సీట్లు తగ్గుతాయన్న అంచనాలున్నాయి. మొత్తంగా 200కన్నా తక్కువ సీట్లే ఆ పార్టీకి వస్తాయని రాజకీయ పరిశీలకుల అంచనా.