Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణకు ఆదేశించిన ఎయిరిండియా
న్యూఢిల్లీ : ఎయిరిండియాలో పైలెట్గా పనిచేస్తున్న మహిళపై అదే సంస్థలో సీనియర్ కెప్టెన్గా ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సంస్థ యాజమాన్యం విచారణ చేపట్టింది. దీనిపై ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసిన ఎయిరిండియా.. సత్వరమే విచారణ చేపట్టాలని ప్యానెల్ సభ్యులను ఆదేశించింది. ఢిల్లీకి చెందిన పైలెట్, సీనియర్ కెప్టెన్లు శిక్షణ కోసం ఈ నెల 5న హైదరాబాద్కు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని పిలిపించిన కెప్టెన్.. ఆ ఉద్యోగిని వైవాహిక జీవితానికి సంబంధించి పలు ఇబ్బందికరమైన ప్రశ్నలడిగారని ఆమె ఆరోపించారు. వాటికి సమాధానాలు చెప్పాలనీ వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.