Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపై మాయవతి ధ్వజం
లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ సాగించిన అరాచక పాలన దేశ చరిత్రలో ఓ మాయని మచ్చ అని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆరోపించారు. లక్నోలో విలేకరులతో మాయవతి మాట్లాడుతూ.. తన కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మోడీకి ఉన్నప్పటికీ ఆయన సాగించిన అరాచక పాలన బీజేపీ, దేశ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయాయని అన్నారు. కానీ తన హయాంలో యూపీలో ఎలాంటి అల్లర్లు, మత విద్వేషాలు చోటుచేసుకోలేదని చెప్పారు. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచీ దేశంలో మత ఘర్షణలు పెరిగిపోయాయని, ఆయన ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. బీఎస్పీని 'బెహన్జీ సంపత్తి పార్టీ'గా అభివర్ణించిన మోడీ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ప్రధాని హద్దులు మీరి మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీలోనే ఎక్కువమంది అవినీతిపరులు, బినామీలు, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారనే విషయం దేశమంతటికీ తెలుసునన్నారు. మోడీ అవినీతిరహితుడు, ఓబీసీ అనే విషయం కాగితాలకే పరిమితమని ఆరోపించారు.