Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు
చండీగఢ్ : దేశ ప్రజలంతా స్వాతంత్య్రం కోసం పోరాడుతుంటే ఆరెస్సెస్ నాయకులు మాత్రం బ్రిటీషర్లకు 'చెంచాగిరి' చేశారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పంజాబ్ పౌరులంతా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడితే ఆరెస్సెస్ నాయకులు మాత్రం వారికి విధేయులుగా ఉన్నారన్నారు. స్వతంత్య్ర సంగ్రామంలో ఆరెస్సెస్ పాల్గొనలేదని ఆరోపించారు. పంజాబ్లో శిరోమణి అకాళీదళ్తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్ల నుంచి రైతులు ప్రధానిని కలవడానికి ఢిల్లీకి పాదయాత్రగా వస్తే ఆయనకు వారిని కలిసే తీరికలేదని విమర్శించారు. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు ఏడో విడతలో భాగంగా ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.