Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: హిందువులకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నాడన్న ఆరోపణలతో ముంబయికి చెందిన హోమియోపతి డాక్టర్ సునీల్ కుమార్ నిషాద్ను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్త రవీంద్ర తివారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఒక వర్గాన్ని, ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు, శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేవిధంగా చర్యలు చెపట్టడం వంటివి నిరోధించటం (ఐపీసీ సెక్షన్ 295ఏ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు అఖిల భారత వెనుకబడిన, మైనారిటీ సామాజిక వర్గ ఉద్యోగుల సమాఖ్య (బామ్సెఫ్) సభ్యుడు. ఇతను ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో రెండేండ్లుగా హిందువులకు వ్యతిరేకంగా, అలాగే భోపాల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞ్యా సింగ్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ పోలీసులు తెలపడం గమనార్హం.