Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ రీవాల్యుయేషన్ అయ్యాకే..: ఏపీ ఉన్నత విద్యామండలి
అమరావతి: ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ పరీక్షల ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ విద్యార్థుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈ ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకల చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో పెను దుమారం చెలరేగింది. దీనిపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఇంటర్ పరీక్షల్లో తప్పిన అభ్యర్థులందరి ఫలితాలు, మార్కుల జాబితాలతో పాటు జవాబు పత్రాలను కూడా ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్, ఏపీలో 115 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్యవిద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్థులు హాజరయ్యారు.