Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ
లక్నో : 'పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ధ్వంసం చేసిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని అదే చోట పునర్ప్రతిష్టిస్తాం' అని ప్రధాని మోడీ హామీనిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని మావులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోల్కతాలో అమిత్ షా ర్యాలీలో టీఎంసీ దౌర్జన్యం కండ్లారా చూశామన్నారు. విద్యాసాగర్ విగ్రహాన్ని వారే కూల్చివేసి, ఆ నెపం తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం యూపీ, బీహర్, పూర్వాంచల్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారిని స్థానికులు కాదంటూ అవమానిస్తున్నదని ఆరోపించారు. కాగా బెంగాల్లో అమిత్షా మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే.