Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పశుసంవర్థక, పాడి, మత్స రంగాల్లో ఒకరికొకరం పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుందామని నెదర్లాండ్ కింగ్డమ్కు చెందిన వ్యవసాయ కౌన్సిలర్ సైబ్ సిహూర్తో సంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా అన్నారు. శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పశుసంవర్ధక, పాడి, మత్స్య రంగాలలో పరస్పర సహకారంపై చర్చించారు. పశుసంవర్ధక రంగంలో సహకారానికి అవకాశమున్న అంశాలపై ఇరు ప్రభుత్వాలు కషి చేస్తే అభివృద్ధిలోముందుంటా మన్నారు. నాలెడ్జ్, ఎక్చెంజ్, సాంకేతికత, ఎక్విప్మెంట్, జెనిటిక్ మెటీరియల్, రిసెర్చ్ అండ్ కెపాసిటి బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాలపై సహకారం అందించుకుం దామన్నారు. ఈ సమావేశంలో నెదర్లాండ్ ట్రెడ్ కమిష నర్ రాంబాబు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివద్ధి సహకార సమాఖ్య యండి శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు రామ్చందర్, తెలంగాణ గొర్రెల మరియు మేకల అభివద్ధి సహకార సమాఖ్య యండి లక్ష్మారెడ్డి, పీవీఎన్ఆర్ వెటర్నటి యూనివర్సిటి రిజిస్ట్రార్ విరోజిరావు, పీవీఎన్ఆర్ వెటర్నటి యూనివర్సిటి డీన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.