Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ సీిఎం చంద్రబాబు ఆ సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత నేరుగా సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఏచూరితో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో మాట్లాడారు. ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి రాజకీయ వ్యూహాలపై చర్చించారు. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టు తెలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, ఎన్డీయేను వ్యతిరేకించే ఏ పార్టీకైనా తాము స్వాగతం పలుకుతామని చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్ను ఆహ్వానిస్తారా ?అన్న ప్రశ్నకు ఎవరిపైనా వివక్ష అంటూ ఉండదన్నారు. త్వరలోనే విపక్షాలన్నీ సమావేశమవుతాయని అన్నారు.
ఈసీ చర్యలన్నీ ఏకపక్షం
కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు మంత్రి కళా వెంకట్రావ్, ఎంపీలు సీఎం రమేష్, కేశినేని నాని, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్షంగా రీపోలింగ్కు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు పక్షపాతంగా ఉన్నాయని బాబు అన్నారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుం టోందని అన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి వద్ద జవాబులు లేకే మీడియా ప్రశ్నలకు మొహం చాటేస్తున్నారని అన్నారు. తాము ఈసీకి చాలా విషయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికల నిర్వహణ ఒక పార్టీకి అనుకూలంగా ఉండకూడదన్నారు. అయిదు వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపులో తేడా వస్తే అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మరోసారి డిమాండ్ చేశారు.
నేడు రాహుల్, అఖిలేష్, మాయవతితో భేటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శనివారం చంద్రబాబు సమావేశమవనున్నట్టు తెలిసింది. ఆదివారంతో చివరి విడత ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతుండడతో విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే అంశంపై చర్చించనున్నట్టు బాబు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు లక్నో వెళ్లి అక్కడ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్సీ చీఫ్ మాయావతితో సమావేశమవుతారని సీఎం అధికారవర్గాలు వెల్లడించాయి.