Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 రాష్ట్రాల్లో 59 స్థానాలకు 19న పోలింగ్
న్యూఢిల్లీ : చివరి, 7వ దశ సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. చివరి దశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. తమ తమ అభ్యర్థులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో చివరిదశలో జరుగుతున్న తొమ్మిది నియోజకవర్గాల ప్రచారం ఈసీ ఆదేశాలతో గురువారం సాయంత్రంతో ముగిసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లోని మొత్తం 13, పశ్చిమబెంగాల్లో 9, బీహార్, మధ్యప్రదేశ్ 8, హిమచాల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో ఒక పార్లమెంటు స్థానానికి పోలింగ్ జరుగనున్నది.
59 స్థానాలకుగాను మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 7వ దశలో పోటీలో వున్న ప్రముఖుల్లో వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్బాదల్ (ఫిరోజ్పుర్), ఆయన భార్య, కేంద్ర మంత్రి హర్సిమ్రాట్ కౌర్ (బటిండా), మరో కేంద్ర మంత్రి హర్దీప్ పురి (అమృత్సర్), పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ భార్య ప్రతీత్ కౌర్ (పటియాలా), హిమచాల్ ప్రదేశ్లోని అనురాగ్ ఠాకూర్ (హమీర్పుర్), జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ (దుంకా), కేంద్ర మాజీ మంత్రి పికె బన్సాల్ తదితరులున్నారు. చివరి విడతలో ప్రధాని మోడీ విస్తృత పర్యటనలు నిర్వహించారు. ఎన్డీయే తరఫున ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఇతర నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీ చీఫ్ మాయావతి, సమాజ్వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్లు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న 13 నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహించారు.