Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్ సర్కార్ నుంచి ఎన్పీఎఫ్ మద్దతు ఉపసంహరణ
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే గెలుపుఅంటున్న బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ సంకీర్ణ ప్రభుత్వంలోని నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) మద్దతు ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని శనివారం ఫ్రంట్ అధికార ప్రతినిధి అచుమబెమో కికోన్ ప్రకటించారు. ఎన్పీఎఫ్ కేంద్రకార్యాలయంలో సుధీర్ఘంగా చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీ నేత ఎన్.బిరెన్ సింగ్ సీఎం గా కొనసాగుతున్నారు. మణిపూర్ అసెంబ్లీలో 60 మంది సభ్యులుంటే.. వారిలో 29మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడి సంకీర్ణ సర్కారుకు ఎన్పీఎఫ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు,ఎల్జేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు నిస్తున్నారు. వాస్తవానికి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 21 సీట్లను గెలుచుకున్నది. ఆ తర్వాత ఎని మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 29కు చేరింది. సంకీర్ణ సర్కారులో అధికార బీజేపీ తమను సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని ఎన్పీఎఫ్ ఆరోపించింది. సంకీర్ణంలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యత నివ్వటంలేదనీ..ఇచ్చిన హామీలూ గాలికివదిలేసిందని ఎన్పీఎఫ్ గుర్రుమంటున్నది.