Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచనాలు వెల్లడించిన లగడపాటి
అమరావతి :తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉండడంతో అక్కడి ప్రజలు కారెక్కారని, ఏపీ ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ఇక్కడి ప్రజలు సైకిలెక్కారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరోక్షంగా ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను వెల్లడించారు. మల్కాపురంలోని ఓ హోటల్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కచ్చితంగా చాలినంత మెజార్జీతోనే ప్రభుత్వం వస్తుందని, హంగ్ ఏర్పడే అవకాశమే లేదని అన్నారు. ఆంధ్ర ప్రజలెప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారన్నారు. తెలంగాణ,ఏపీ లో ఎవరికెన్ని సీట్లు వస్తాయో ఆదివారం సాయంత్రం తిరుపతిలో వెల్లడిస్తానన్నారు. పవన్ కల్యాణ్ మెగాస్టార్ తమ్ముడు కాబట్టే అన్న కంటే తక్కువ సీట్లే వస్తాయని, అయితే పవన్ అసెంబ్లీలోకి అడుగుపెడతారని చెప్పారు. కేంద్రంలో ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యం రాదన్నారు. ఏపీలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీలకే 90 శాతం మంది ఓట్లేశారనీ, మూడో పార్టీ ప్రభావం వల్ల రెండు పార్టీలకూ ఈ సారి ఓటింగ్ శాతం తగ్గుతుందని తెలిపారు.