Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్ జరగనుంది. తొలుత ఐదు పోలింగ్ కేంద్రాల్లోనే ఈ ప్రక్రియను నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి టీడీపీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. తాము కోరుతున్న చోట్ల కూడా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. టీడీపీ నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకుని మరో రెండు కేంద్రాల్లో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో ఆదివారం 321వ పోలింగ్ కేంద్రం(ఎన్ఆర్ కమ్మపల్లి), 104వ పోలింగ్ కేంద్రం (పులివర్తి పల్లి), 316వ పోలింగ్ కేంద్రం(కొత్త కండ్రిగ), 318వ పోలింగ్ కేంద్రం (కమ్మపల్లి), 313వ పోలింగ్ కేంద్రం(వెంకట్రాంపురం), 310వ పోలింగ్ కేంద్రం(కాలేపల్లి), 323వ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరగనుంది.