Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు నేరాల్లో దోషిగా నిర్ధారణ
భువనేశ్వర్: మావోయిస్టు నేత సవ్యసాచి పాండేకు ఒడిషాలోని బెర్హంపూర్ అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా యుద్ధాన్ని పూరిగొల్పుతున్నాడని, తిరుగుబాట్లను చేశాడనే నేరంతో పాండేను ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)సెక్షన్ 121 ప్రకారం దోషిగా నిర్ధారించింది. ఒడిషాలో మావోయిస్టు హింసాకాండలో, గజపతి జిల్లాలోని ఆర్.ఉదరుగిరి పట్టణంపై దాడి కేసులో, నయాగర్ పోలీస్ స్టేషన్లో ఆయుధాల దోపిడీ కేసులో, కందమాల్ జిల్లాలో వీహెచ్ పీ నాయకుడు స్వామి లక్ష్మణానంద సర స్వతి హత్య కేసులో, కందమాల్ జిల్లాలో ఇద్దరు ఇటాలియన్ పర్యాటకులను అప హరణ కేసుల్లో పాండేను దోషిగా గుర్తిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పాండే తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. పాండే సీపీఐ మావోయిస్టు సభ్యుడుగా చేరారు. కానీ అందులో నుంచి 2012లో బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఒడిషా మావో పార్టీని స్థాపించారు. ఇతడిని తొలుత 2015లో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాట్లను, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్గిస్తున్నాడనే ఆరోపణలతో మంగళ వరంపేటలో అరెస్టు చేశారు. అతని నుంచి ఓ రివాల్వర్ను, రూ. 2,11,000 నగదును, 800 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 15మంది సాక్షులను విచారించి, ఆధారాలను సేకరించారు.