Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని వ్యక్తిగత భద్రతా సిబ్బంది హత్య చేసిన మాదిరిగానే తనను కూడా అంతమొందించేందుకు కుట్ర జరుగుతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిం చారు. ఏదో ఒక రోజు బీజేపీ తనను హత్య చేయిస్తుందని ఆరోపణలు చేశారు. 'ఇందిరా గాంధీని వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంపిన విధంగానే ఏదో ఒక రోజూ ..నా వ్యక్తిగత భద్రతా సిబ్బందితోనే నన్ను బీజేపీ హత్య చేయిస్తుంది. నాకు సంబం ధించిన సమాచారాన్ని నా వ్యక్తిగత సిబ్బందే బీజేపీకి చేరవేస్తున్నారు' అని కేజ్రీ వాల్ వ్యాఖ్యానించారు. ఇటీవల మోతీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్పై ఎర్రరంగు టీషర్టు ధరించిన అగంతకుడు దాడి చేసి చెంపదెబ్బ కొట్టి న ఘటన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.