Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆగ్రహం
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడంటూ భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమా రం రేపుతున్నాయి. తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి కూడా ట్విటర్ వేదికగా ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నాడు గాడ్సే బాపూజీ శరీరాన్ని చంపితే.. నేడు వీళ్లు ఆయన ఆత్మను చంపుతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. 'గాంధీజీ శరీరాన్ని గాడ్సే చంపాడు. కానీ ప్రజ్ఞా లాంటి వాళ్లు నేడు ఆయన ఆత్మతో పాటు అహింస, శాంతి, సహనాలను కూడా చంపేస్తున్నారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతమైన వ్యక్తి గాంధీ. అలాంటి వ్యక్తులను వెంటనే బీజేపీ పేర్కొన్నారు.