Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీవీప్యాట్లను 50 శాతమైనా కౌంటింగ్ చేయాలి: చంద్రబాబు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని ఎలక్షన్ కమిషన్ మాజీ కమిషనర్లు నవీన్ చావ్లా, ఎస్వై ఖురేషి అభిప్రాయపడ్డారు. ఈసీ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించ కుండా అన్ని పక్షాలను సమానంగా చూడాలన్నారు. దేశ ప్రజాస్వామ్య రక్షణలో ఈసీదే కీలక బాధ్యత అని అభిప్రాయపడ్డారు. వీవీప్యాట్లను కౌంటింగ్ చేస్తేనే పూర్తి స్థాయిలో ప్రజాతీర్పుకు గౌరవమించినట్టు ఉంటుందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ అనుమ తించ కూడదని అన్నారు. దీని వల్ల ఎన్నికల్లో ధన ప్రవాహం పెరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలుస్తుందని... మరొక పార్టీ ఓడుతుందని... కానీ ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రజాస్వామ్య స్పూర్తి తో జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల సంస్కర ణలకు చంద్రబాబు ఎంతో సహకరించారని కొనియా డారు. వీవీప్యాట్ల లెక్కింపు పెంపు, ఈవీఎంలపై చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు మద్దతు ప్రకటిం చారు. ఢిల్లీలోని ఐఐసీలో ''భారత్లో ఎన్నికల విధానం-జవాబుదారీతనం''అనేఅంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, విశ్రాంత న్యాయమూర్తి మదన్ లోకూర్, మాజీ ఎన్ని కల కమిషనర్లు నవీన్ చావ్లా, ఎస్వై ఖురేషి హాజర య్యారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై ఎన్నో అనుమానాలు న్నాయి. వాటిని నివత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. తాము రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈవీఎం, వీవీప్యాట్లపై పోరాడుతున్నామని అన్నారు. దీనిపై పౌర సమాజం, ఖురేషి, చావ్లా, జస్టిస్ మదన్ బీ లోకూర్ వంటి మేధావులు స్పందించడం ఆశించదగ్గ పరిణామం అన్నారు. పౌర సమాజం వీవీప్యాట్లు 100 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయని... అయితే, రాజకీయ పార్టీలమైనా మేము కనీసం 50 శాతం అయినా లెక్కించాలని కోరుతున్నామని వివరించారు. అయినప్పటికీ, ఈసీ తమ అభ్యర్థనను తొసిపుచ్చు తున్న పరిస్థితి యావత్ దేశమంతా కనిపిస్తోందని వెల్లడించారు. ఈవీఎంను పూర్తిగా నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే, దాన్ని ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్నికల సంఘాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు....పారదర్శకంగా తన విధులు నిర్తరించే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఈసీలో ఉన్నటువంటి లొసుగులను సవరించకపోతే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అవుతుందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభు త్వం వేసిన కమిటీకి తాను బాధ్యత వహించానని ... అన్ని పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని తీసు కురావాలని సూచించానని అన్నారు. అయితే, మోడీ సర్కారు ఈ సిఫారసు పెడ చెవిన పెట్టిందన్నారు.