Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్, మాయవతి, సురవరం తదితరులతో భేటీ
- ఫలితాల తర్వాత కార్యాచరణపై చర్చలు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేతర కూటమిని సంఘటిత పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ నాయ కులతో వరుసగా భేటీ అవుతున్నారు. బీజేపీయేతర పార్టీల న్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి మంతనాలు జరుపుతున్నారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్
యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, డీ రాజాతో చర్చలు జరి పారు. ఫలితాలకు ముందే ఈనెల 22వ తేదీన విపక్ష నేతలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఈ మేరకు చంద్రబాబు నేరుగా వివిధ పార్టీల నేతలతో నేరుగా సమావేశమై చర్చలు జరుపుతు న్నట్టు తెలిసింది. ఏపీ భవన్లో సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, డి.రాజాతో చర్చలు జరిప ిన అనంతరం నేరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ నివాసానికి వెళ్లి సుమారు గంటపాటు భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమికి 200లోపే సీట్లు వస్తాయని, ఈ నేపథ్యంలో బీజేపీని అధికారంలో రాకుండా అడ్డుకు నేందుకు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరపాలని రాహుల్తో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
బీజేపీయేతర వ్యవహరించే పార్టీలను ముందుగానే ఒప్పందానికి రావాలని భావిస్తున్నారు. మెజారిటీ కంటే ఎన్డీయేకు సుమారు 80 సీట్లు తక్కువ పడతాయని నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గాలానికి ఈ 80 మంది ఎంపీలు దొరక్కుండా ఉండేందుకు ఆయా పార్టీలను ముందుగానే తమవైపు తిప్పుకోవాలని నిర్ణయించారు. తమ కూటమి అతిపెద్దదనే విషయాన్ని ముందుగానే రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయాలని యోచిస్తున్నారు. అతిపెద్ద పార్టీ బీజేపీకి కాకుండా తమ కూటమికే అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని కలవాలని యోచిస్తున్నట్టు తెలిసింది.